డొమెస్టిక్ వర్కర్స్కి బ్యాంక్ గ్యారంటీ ఉపసంహరణ
- September 04, 2017
కువైట్: భారత ప్రభుత్వం, 2,500 అమెరికా డాలర్ల బ్యాంకు గ్యారంటీని ఉపసంహరించుకుంది. భారతీయ మహిళా డొమెస్టిక్ వర్కర్స్కి సంబంధించి, ఈ బ్యాంకు గ్యారంటీ ఇప్పటిదాకా తప్పనిసరి. కువైట్లో డొమెస్టిక్ రంగంలో పనిచేసేవారికి ఇదొక ఆర్థిక భారంగా మారింది. దాంతో, భారత ప్రభుత్వం ఈ ఉపశమన చర్య తీసుకుంది. ఇంకో వైపున, ఆరు ప్రభుత్వ రంగ రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు మాత్రమే రిక్రూట్మెంట్ని పరిమితం చేయడం జరిగింది. నాన్ రెసిడెంట్ కేరలైట్స్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్, తిరువనంతపురం, కేరళ, ఓవర్సీస్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, తిరువనంతపురం, కేరళ, ఓవర్సీస్ మ్యాన్పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, చెన్నయ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, కాన్పూర్, తెలంగాణ ఓవర్సీస్ మేన్ పవర్ కంపెనీ, హైద్రాబాద్ మరియు ఓవర్సీస్ మేన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఆ ఆరు సంస్థలు. రెండేళ్ళ క్రితమే, 2500 అమెరికా డాలర్లు (720 కువైట్ దినార్స్) బ్యాంకు గ్యారెంటీగా మహిళా డొమెస్టిక్ వర్కర్స్కి విధించింది. కువైట్ అథారిటీస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం, అలాగే ఫిమేల్ ఇండియన్ డొమెస్టిక్ వర్కర్స్ - కువైట్ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వం ఉపసంహరించింది.
తాజా వార్తలు
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!







