27న బెజవాడకు తెలంగాణ సీఎం

- September 05, 2017 , by Maagulf
27న బెజవాడకు తెలంగాణ సీఎం

కనకదుర్గమ్మకు ముక్కు పుడక సమర్పించనున్న కేసీఆర్‌
ఢిల్లీ నుంచి రాగానే పర్యటన ఖరారు
విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి సీఎం కేసీఆర్‌ ఈనెల 27వ తేదీన విజయవాడ వెళ్లనున్నట్లు తెలిసింది. కుటుంబ సమేతంగా అమ్మవారికి ముక్కు పుడకను సమర్పించనున్నారు. ఇప్పటికే వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, తిరుపతి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొక్కులు తీర్చుకుంటానని కేసీఆర్‌ ప్రకటించగా.. అందుకోసం రాష్ట్రం వచ్చిన తర్వాత రూ.59 లక్షలు కేటాయించారు. ఇందులో భాగంగా అన్ని దేవాలయాలను దర్శించుకున్న ఆయన ఒక్క విజయవాడలో అడుగుపెట్టలేదు.
గతేడాదే పర్యటన ఉంటుందని భావించినప్పటికీ కుదరలేదు. సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక విజయవాడ పర్యటనను ఖరారు చేయనున్నారు. ఈనెల 27న ఏపీ ప్రభుత్వం కూడా కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనుంది. అదే రోజు సీఎం కేసీఆర్‌ కూడా ముక్కు పుడకను సమర్పించి.. మొక్కు తీర్చుకోను. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com