వేసవి లో కార్మికులకు పని నిషేధం ఓ భారీ విజయం: మంత్రి
- September 06, 2017
మనామ : బహిరంగ పని నిషేధంను పలు కంపెనీలు మరియు సంస్థల తొంభై ఎనిమిది శాతం అమలుచేశాయి. మిట్ట మధ్యాహ్నం నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రామికులను తీవ్ర వేసవి వేడిమి సమయంలో పనిని చేయకుండా నిలువరించినట్లు కార్మిక మంత్రి జమీల్ బిన్ మహ్మద్ ఆలీ హుమాదాన్ బుధవారం చెప్పారు. ఈ వేసవిలో బహిరంగ పని నిషేధం ముగింపు గురించి వ్యాఖ్యానిస్తూ, 150,000 కన్నా ఎక్కువ మంది కార్మికులను కాపాడటం మరియు మానవ హక్కులను కాపాడుకోవాలనే ఆసక్తితో వివిధ పని ప్రదేశాలలో భద్రత కల్పించే లక్ష్యాలను సాధించినట్లు ఆయన తెలిపారు. బహిరంగ మధ్యాహ్నం పని నిషేధం 2013 యొక్క 3 వ ఎడిషన్ ప్రకారం యజమానులకు దీని గూర్చి అధిక అవగాహన ప్రతిబింబిస్తుంది, కంపెనీల పూర్తి సహకారం, మానవ జీవితం యొక్క గొప్ప విలువలకై వారు చూపిన సానుకూల స్పందన మరియు అవగాహన అభినందిస్తున్నాము. 98 శాతం సమ్మతి రేటు కార్మికులు రక్షించడానికి మరియు వారి భద్రత నిర్ధారించడానికి వారి మానవతను సూచిస్తుంది మానవ హక్కుల పట్ల గౌరవంగా ప్రతిబింబిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో బహ్రెయిన్ అధునాతన పురోగతులు స్వాగతం పలుకుతున్నాయని, అంతర్జాతీయ సంస్థల చేత కీర్తించబడుతున్నట్లు ఆయన అన్నారు. కార్మిక మంత్రిత్వశాఖ కార్మికులు పని చేసే ప్రాంతాలలో పర్యావరణం అభివృద్ధి, ప్రైవేటు రంగాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం, సాధ్యమైనంత వృత్తిపరమైన ప్రమాదాలు జరగకుండా నివారించడం, ఉత్పాదకత మరియు సంస్థల లాభాలను పెంపొందించడం వంటి అంశాలని ఆయన ప్రముఖంగా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







