ఓయూలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
- September 09, 2017
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ప్రజాకవి, పద్మభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని, కాళోజీ జయంతిని సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్యులు, పరిశోధకులు మాట్లాడుతూ కాళోజీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ భాషా వైశిష్ట్యాన్ని, తెలంగాణ మాండలికాన్ని కాళోజి నిర్భయంగా ఉపయోగించిన తీరును వివరించారు.
ఆయన నిరాడంబర జీవితాన్ని గుర్తు చేస్తూ, జీవితాంతం బడుగు బలహీనుల కోసం కలాన్ని కదిపిన మహనీయుడని అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా కంటతడిపెట్టే సున్నితమైన మనసుగలవారని, అదే సమయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒంటరిగా ప్రశ్నించే దీశాలి అని కొనియాడారు. కాళోజి అందించిన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అందుకోవాలన్నారు. తెలంగాణా భాష, యాసల ఖ్యాతిని నలుదిశలా విస్తరింపజేయాల్సిన బాధ్యత భావి పరిశోధకులపై ఉందన్నారు. ఈ కార్యమంలో ఆర్ట్స్ కళాశాల ఉప ప్రధానాచార్యులు, తెలుగు శాఖ అధ్యక్షులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









