అమెరికా పర్యటనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ
- September 11, 2017
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రెండు వారాల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయలుదేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా రాజకీయ నాయకులు, మేధావులతో ఆయన సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతోనూ మాట్లాడుతారు. తొలుత ప్రతిష్ఠాత్మక కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వర్డ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భారతదేశంలోని వర్తమాన రాజకీయాలపై రాహుల్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని యూనివర్సిటీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడా, ఇండియన్ ఓవర్సీస్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్వోసీ), యూఎస్ అధ్యక్షుడు శుద్ధ్సింగ్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో రాహుల్కు స్వాగతం పలుకుతారు. 1949లో భారత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ ఎక్కడి నుంచి ప్రసంగించారో, అదే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాహుల్ ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







