అమెరికా పర్యటనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ
- September 11, 2017
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రెండు వారాల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయలుదేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా రాజకీయ నాయకులు, మేధావులతో ఆయన సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతోనూ మాట్లాడుతారు. తొలుత ప్రతిష్ఠాత్మక కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వర్డ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భారతదేశంలోని వర్తమాన రాజకీయాలపై రాహుల్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని యూనివర్సిటీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడా, ఇండియన్ ఓవర్సీస్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్వోసీ), యూఎస్ అధ్యక్షుడు శుద్ధ్సింగ్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో రాహుల్కు స్వాగతం పలుకుతారు. 1949లో భారత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ ఎక్కడి నుంచి ప్రసంగించారో, అదే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాహుల్ ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







