అమెరికా పర్యటనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ
- September 11, 2017
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రెండు వారాల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయలుదేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా రాజకీయ నాయకులు, మేధావులతో ఆయన సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతోనూ మాట్లాడుతారు. తొలుత ప్రతిష్ఠాత్మక కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వర్డ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భారతదేశంలోని వర్తమాన రాజకీయాలపై రాహుల్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని యూనివర్సిటీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడా, ఇండియన్ ఓవర్సీస్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్వోసీ), యూఎస్ అధ్యక్షుడు శుద్ధ్సింగ్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో రాహుల్కు స్వాగతం పలుకుతారు. 1949లో భారత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ ఎక్కడి నుంచి ప్రసంగించారో, అదే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాహుల్ ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









