పొల్లాచ్చిలో బెల్లంకొండ శ్రీనివాస్ పోరాటాలు
- September 12, 2017
బె ల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీవాస్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అభిషేక్ నామా నిర్మాత. ఇటీవల పొల్లాచ్చిలో పీటర్ హెయిన్స్ ఆధ్వర్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''బలమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. సాంకేతికంగానూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం. పొల్లాచ్చిలో 15 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించాం. పీటర్ హెయిన్స్ సరికొత్తగా డిజైన్ చేశారు.
అందులో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా నటించారు. యువతరంతో పాటు, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే చిత్రం అవుతుంది. ఈ సినిమాతో శ్రీనివాస్కి సరికొత్త ఇమేజ్ ఏర్పడుతుంద''న్నారు. జగపతిబాబు, శరత్కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురుస్వామి తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







