'APNRI' లకు భీమా సౌకర్యం కల్పించుకున్న ఏ.పి ప్రభుత్వం

- September 13, 2017 , by Maagulf
'APNRI' లకు భీమా సౌకర్యం కల్పించుకున్న ఏ.పి ప్రభుత్వం

అమరావతి: APNRT ప్రెసిడెంట్ డా.రవి వేమూరు  మరియు CEO సాంబశివ రావు  తో ఆంధ్ర ప్రదేశ్ CM చంద్రబాబు  జరిపిన సమావేశం లో విదేశాల లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారి సమస్యల పై చర్చిండం జరిగింది.

ఈ సమావేశం లో కొన్ని కీలక అంశాలు పై నిర్ణ యాలు తీసుకుని అంగీకరించడం జరిగింది. వాటిలో ముఖ్యం గా విదేశాలలో ఉంటూ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ పాలసి, అంగ వైకల్యం, ఆరోగ్యం మొదలైన వాటికి సంభందించిన ఇన్సూరెన్స్, ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయం, గల్ఫ్ లో ఉంటున్న పేదవారి కి సహాయం, 24 గంటల అత్యవసర టెలిఫోన్ హాట్ లైన్ మొదలైనటువంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే APNRT ద్వారా అత్యవసర నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయ కార్యక్రమాలు చేయటానికి వీలు గా apnrt కి అధికారాలు కలుగ చేయనున్నారు.ఈ విషయమై మరిన్ని పూర్తి వివరాలు కూలంకుశం గా మాకు అందిన వెంటనే ప్రచురించడం జరుగు తుంది.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com