థైరాయిడ్కు చెక్ పెట్టాలంటే.. పెరుగు, చేపలు తినాల్సిందే..
- September 15, 2017
థైరాయిడ్ సమస్య వేధిస్తుందా? డాక్టర్ల సలహాతో మందులు తీసుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి. ఈ ఆహారాన్ని రోజూవారీ డైట్లో చేర్చుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు సలహా ఇస్తున్నారు. థైరాయిడ్కు చెక్ పెట్టాలంటే.. రోజూ అర కప్పు పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. ఇక వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తీసుకోవాలి.
పెరుగులో వుండే విటమిన్ డి, ప్రొబయోటిక్స్ థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యతలు తగ్గిపోతాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలు ఇవ్వడంతో పాటు మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. తద్వారా థైరాయిడ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్ను కూడా వంటల్లో చేర్చుకుంటే థైరాయిడ్ సమస్య దరిచేరదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటితో పాటు కోడిగుడ్లు, రొయ్యలు, పాలకూర వెల్లుల్లి, వాల్నట్స్, పచ్చి పఠాణీలు, బాదం, మష్రూమ్స్ వంటివి డైట్లో చేర్చుకుంటే థైరాయిడ్ నుండి విముక్తి పొందవచ్చునని వారు చెప్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









