తిండి లేకుండా కేవలం మంచినీరు, టీ తోనే బతుకుతున్న 75 ఏళ్ల బామ్మ
- September 16, 2017
60 ఏళ్లనుంచి ఈ బామ్మ ఒట్టి మంచినీరు, టీ తాగి బతికేస్తుంది. అప్పుడప్పుడు ఓ అరటి పండు మాత్రం తింటుందట. మధ్య ప్రదేశ్కు చెందిన సరస్వతీ బాయికి 15 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. ఆ వెంటనే గర్భం దాల్చిన ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందట. దాంతో డాక్టర్స్ ఆమెకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోమన్నారట. ఆరోజు నుంచి మొదలు ఇప్పటి వరకు నీళ్లు, టీ మాత్రమే తన ఆహారంగా తీసుకుంటుందట. ఇప్పుడు 75 ఏళ్ల వయస్సులో ఉన్న ఈ బామ్మ పొలం పనులు చకచకా చేసేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రోజుకి 7గంటలు పొలంలోనే గడిపేస్తుంది. అయిదుగురు పిల్లలకి తల్లయినా ఏమీ తీసుకోకుండానే 75 ఏళ్లు గడిపింది. అన్నం తినమని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ తన మనసు మార్చుకోలేదని ఆమె భర్త ద్వారకా ప్రసాద్ పాటికర్ అంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా బామ్మగారు ఏమి తినరట. కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుని ఆరోగ్యంగా ఉంటున్న ఈ బామ్మని అందరూ పొగిడేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







