సీఎం చంద్రశేఖర్రావు చేతులమీదుగా బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ
- September 17, 2017ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడీని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదివారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. సామాన్య ప్రజలలో ప్రాచుర్యం పొందిన అందమైన బతుకమ్మ పాటలతో ఇప్పటివరకు 8 సీడీలను జాగృతి తయారుచేసింది. ప్రతి ఏడాదిలాగే తెలంగాణ జాగృతి ఇప్పుడు కూడా 40 పాటలతో సీడీని రూపొందించింది. ఇందులో 12 మంది ప్రముఖ జానపద గాయకులు పాడిన బతుకమ్మ పాటలు, ఇతర సంప్రదాయ గేయాలున్నాయి. సంప్రదాయ బతుకమ్మ పాటలు వెలకట్టలేని గొప్ప సాహిత్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
వాటిని సేకరించి సీడీల రూపంలో భద్రపరుచడం మంచి ప్రయత్నమని కొనియాడారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, డాక్టర్ అయాచితం శ్రీధర్, దాస్యం విజయ్భాస్కర్, అధికార ప్రతినిధి కుమారస్వామి, కోశాధికారి కొండపల్లి సంతోష్కుమార్, మహిళా విభాగం కన్వీనర్ డాక్టర్ ప్రభావతి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను, వివిధ విభాగాల కన్వీనర్లు కొరబోయిన విజయ్, పసుల చరణ్, డాక్టర్ ప్రీతిరెడ్డి, దాసరి శ్రీనివాస్, అంజనా రెడ్డి, తిరుపతి వర్మ, డాక్టర్ కాంచనపల్లి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







