'ఉరీ' ఉగ్ర దాడులు ఆధారంగా బాలీవుడ్ లో సినిమా
- September 20, 2017
భారత్ను లక్ష్యంగా చేసుకుని ఏడాది క్రితం మన దేశ అధీన రేఖకు ఆవలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ దాడులు జరిపింది. ఇప్పుడు ఇదే అంశాన్ని నేపథ్యంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ 'ఉరి' ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత రొన్నే స్క్రేవాలా నిర్మించే ఈ సినిమాలో విక్కీ కుశాల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. లక్షిత దాడుల ద్వారా ప్రపంచంలో భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని రొన్నే స్క్రేవాలా అన్నారు. ఈ సినిమాలో సైన్యానికి కమాండర్గా కనిపించనున్న విక్కీ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సైన్యం చేసిన ఈ దాడుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







