కువైట్ గల్ఫ్ సంక్షోభం: కువైట్ మధ్యవర్తిత్వానికి ఖతార్ ప్రశంసలు
- September 21, 2017
న్యూయార్క్: ఖతారీ ఎమిర్ షేక్ తమీమ్ అల్ థని మాట్లాడుతూ, చిత్తశుద్ధితో గల్ఫ్ సంక్షోభం విషయంలో కువైట్ మధ్యవర్తిత్వం వహిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారాయాన. గత కొంతకాలంగా గల్ఫ్లో నెలకొన్న సంక్షోభానికి సంబంధించి కువైట్ మద్యవర్తిత్వం వహిస్తోంది. ఖతార్ ఓ వైపు, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ మరో వైపు నిలిచాయి. ఖతార్ తీవ్రవాదానికి మద్దతిస్తోందని మిగిలిన దేశాలు ఆరోపిస్తూ, ఖతార్తో సంబంధాలు తెంచుకోవడంతో సంక్షోభం తలెత్తింది. ఖతార్ ఎప్పుడూ తీవ్రవాదానికి మద్దతివ్వడంలేదని ఈ సందర్బంగా షేక్ తమీమ్ స్పష్టం చేశారు. జిసిసి దేశాల ఐక్యత కోసం ఖతార్ కృషి చేస్తుందనీ, సమాచార లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







