స్త్రీల బుర్రలో సగం మెదడు ఉంటుందని హేళన చేసిన ఓ ఇమామ్
- September 23, 2017
మానామా: నాలుకా...వీపునకు దెబ్బలు తీసుకురాకు అని మన తెలుగులో చక్కని సామెత ఉంది..అది తెలియని ఓ మతబోథకుడు నోరు ఇలా జారేడు.. " ఆడవారు సరిగా ఆలోచించలేరు.... స్త్రీల బుర్రలో సగం మెదడు ఉంటుందని " పైత్యం తలకెక్కిన ఓ ఇమామ్ మహిళలపై నోరు పారేసుకుని ఫలితంగా తన జీవనాధారాన్ని చేచేతులారా పోగొట్టుకున్నాడు. వివరాలలోకి వెళితే ఓ మతబోథకుడు ఇటీవల స్త్రీలను కించపరుస్తూ ఎగతాళిగా మాట్లాడాడు. ‘మహిళలకు కేవలం సగం మెదడు మాత్రమే ఉంటుంది. . సగం మెదడు ఉండే వీరిని షాపింగ్కు తీసుకుపోతే మరో 25 శాతం కూడా తగ్గిపోతుంది’ అని సాద్ అల్ హజారీ అనే ఓ ఇమామ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. మహిళలను తీవ్రంగా అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని మహిళలు, నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సౌదీ యువరాజు ఫైసల్ బిన్ ఖలీద్ బిన్ అబ్ధుల్ అజీజ్ మతప్రబోధకుడని తొలగించారు. ఇకపై ఆ ఇమామ్ ఎలాంటి మతప్రబోధనలు చేయకూడదంటూ ఆదేశించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







