2022 కల్లా అందరికీ ఇళ్లు.!

- September 23, 2017 , by Maagulf
2022 కల్లా అందరికీ ఇళ్లు.!

మోడీ మిషన్ 2022 మొదలుపెట్టారు. యూపీలో పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించిన ఆయన.. రెండు వేల ఇరవై రెండు నాటికి.. దేశాన్ని మార్చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి.. ప్రతీ ఒక్కరూ ఒక్కో సంకల్పాన్ని తీసుకోవాలన్నారు. దీనివల్ల ఐదేళ్లలోనే దేశం 125 కోట్ల అడుగులు ముందుకు వెళుతుందన్నారు. అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడంతో పాటు.. అందరికీ ఇళ్లు కల్పించడమే తాను సంకల్పంగా తీసుకున్నానన్నారు ప్రధాని.

ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని.. షెహన్‌షా పూర్‌లో మరుగుదొడ్జి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి ఇటుకలు పేర్చారు. అనంతరం.. గోశాలను,  పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు. తమకు పార్టీ కన్నా దేశమే ముఖ్యమన్న ప్రధాని.. ఇతర పార్టీల్లా ఓటు బ్యాంకు రాజకీయాలను చేయమన్నారు. అందుకే.. ఓటు హక్కులేని పశువుల కోసం ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com