2022 కల్లా అందరికీ ఇళ్లు.!
- September 23, 2017
మోడీ మిషన్ 2022 మొదలుపెట్టారు. యూపీలో పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించిన ఆయన.. రెండు వేల ఇరవై రెండు నాటికి.. దేశాన్ని మార్చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి.. ప్రతీ ఒక్కరూ ఒక్కో సంకల్పాన్ని తీసుకోవాలన్నారు. దీనివల్ల ఐదేళ్లలోనే దేశం 125 కోట్ల అడుగులు ముందుకు వెళుతుందన్నారు. అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడంతో పాటు.. అందరికీ ఇళ్లు కల్పించడమే తాను సంకల్పంగా తీసుకున్నానన్నారు ప్రధాని.
ఉత్తర ప్రదేశ్లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని.. షెహన్షా పూర్లో మరుగుదొడ్జి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి ఇటుకలు పేర్చారు. అనంతరం.. గోశాలను, పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు. తమకు పార్టీ కన్నా దేశమే ముఖ్యమన్న ప్రధాని.. ఇతర పార్టీల్లా ఓటు బ్యాంకు రాజకీయాలను చేయమన్నారు. అందుకే.. ఓటు హక్కులేని పశువుల కోసం ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









