2022 కల్లా అందరికీ ఇళ్లు.!
- September 23, 2017
మోడీ మిషన్ 2022 మొదలుపెట్టారు. యూపీలో పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించిన ఆయన.. రెండు వేల ఇరవై రెండు నాటికి.. దేశాన్ని మార్చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి.. ప్రతీ ఒక్కరూ ఒక్కో సంకల్పాన్ని తీసుకోవాలన్నారు. దీనివల్ల ఐదేళ్లలోనే దేశం 125 కోట్ల అడుగులు ముందుకు వెళుతుందన్నారు. అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడంతో పాటు.. అందరికీ ఇళ్లు కల్పించడమే తాను సంకల్పంగా తీసుకున్నానన్నారు ప్రధాని.
ఉత్తర ప్రదేశ్లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని.. షెహన్షా పూర్లో మరుగుదొడ్జి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి ఇటుకలు పేర్చారు. అనంతరం.. గోశాలను, పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు. తమకు పార్టీ కన్నా దేశమే ముఖ్యమన్న ప్రధాని.. ఇతర పార్టీల్లా ఓటు బ్యాంకు రాజకీయాలను చేయమన్నారు. అందుకే.. ఓటు హక్కులేని పశువుల కోసం ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







