రష్యాలోని ఆదర్శ దంపతులు.. నరమాంసం మాత్రమే తింటారు
- September 26, 2017
ఒక జంతువు మరో జంతువుని చంపి తినడం ప్రకృతి సహజం. ఆధునిక మానవుడు కూడా అనాగరికంగా ప్రవర్తిస్తున్నాడు. మనుషులు కూడా మృగాల్లా మారిపోతున్నారు. ఈ మధ్య ఇలాంటి వార్తలు తరచూ వింటున్నాము. నరమాంస భక్షకులు మనుషుల మధ్యే సంచరిస్తున్నారు. మనుషుల్ని వెంటాడి, వేటాడి హత్య చేసి శుభ్రంగా ఆరగించేస్తున్నారు. రష్యాలోని క్రాస్రోడర్లో నివసిస్తున్న దిమిత్రి భక్షీవ్ తన భార్య నటాలియా ఇద్దరూ నరమాంస భక్షకులు. వీరు మనుషులను హత్య చేసి వారి అవయవాలను హాయిగా భుజించేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వీరీపని చేస్తున్నారు. పండ్ల మధ్యలో మృతదేహాల అవయవాలను పెట్టి తినేస్తున్నారు. వీరు చేసే ఈ పనిని సెల్ఫీల్లో బంధించేవారు. ఈ క్రమంలో దిమిత్రి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఓ వ్యక్తికి ఈ ఫోన్ దొరకగా అతడు దానిని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఫోన్లో డాటాను చెక్ చేయగా మృత దేహాల అవయవాలు తింటున్న భార్యా భర్తలు కనిపించడంతో మాస్కో పోలీసులు వీరిని పట్టుకుని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 1999 నుంచి దాదాపు 30 మందిని హత్య చేసి వారి అవయవాలు తింటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వీరి ఇంటి సెల్లార్లో మరిన్ని మృతదేహాలు గుర్తించారు. హత్యకు గురైనవారిలో కేవలం ఏడుగురిని మాత్రమే పోలీసులు కనిపెట్టగలిగారు. గతంలో ఫిలిఫ్పీన్స్లోనూ, దుబాయ్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. హత్య చేసి వారి మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని తిన్న ఘటనలు గతంలో కూడా వెలుగు చూసాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







