పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మరో సర్జికల్ స్ట్రైక్
- September 27, 2017
బుధవారం తెల్లవారుఝామున ఇండియన్ ఆర్మీ మరో సర్జికల్ స్ట్రైక్ చేసింది. అయితే ఈసారి ఇండో, మయన్మార్ బోర్డర్లో ఈ దాడులు జరిగాయి. నాగా తీవ్రవాదుల శిబిరాలపై ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఇండియన్ పారా కమాండోలు ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగా తీవ్రవాదుల శిబిరానికి భారీ నష్టం వాటిల్లినట్లు ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ వైపు ఎలాంటి నష్టం జరగలేదని కూడా స్పష్టంచేసింది. గతేడాది ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ సర్జికల్ ైస్ట్రెక్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2001లో భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసింది నాగా ఉగ్రవాద సంస్థ. అయితే 2015, మార్చి 27న ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. నాగాలాండ్, మణిపూర్లలోని భారత జవాన్లపై దాడులు చేశారు. జూన్ 4, 2015లో మణిపూర్లోని డోగ్రా రెజిమెంట్లో ఆర్మీ కాన్వాయ్పై దాడి చేయగా 18 మంది సైనికులు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







