అక్టోబర్ 27న వస్తున్న రామ్ 'ఉన్నది ఒక్కటే జిందగీ'
- September 28, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేనుశైలజతో రామ్ కి చాలా గ్యాప్ తర్వాత హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది.
నేను శైలజ తర్వాత రామ్ నటించిన చిత్రం హైపర్. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో మళ్ళీ రామ్, నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమలకే చాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ మూవీని అక్టోబర్ 27న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.
ఉన్నది ఒక్కటే జిందగీ మూవీలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో రామ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. లవ్, ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ ఇటలీ మిలాన్ వంటి ఫేమస్ లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. ఈ మూవీతో రామ్, కిషోర్ తిరుమల మరో హిట్ ఇస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం







