అక్టోబర్ 27న వస్తున్న రామ్ 'ఉన్నది ఒక్కటే జిందగీ'
- September 28, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేనుశైలజతో రామ్ కి చాలా గ్యాప్ తర్వాత హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది.
నేను శైలజ తర్వాత రామ్ నటించిన చిత్రం హైపర్. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో మళ్ళీ రామ్, నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమలకే చాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ మూవీని అక్టోబర్ 27న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.
ఉన్నది ఒక్కటే జిందగీ మూవీలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో రామ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. లవ్, ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ ఇటలీ మిలాన్ వంటి ఫేమస్ లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. ఈ మూవీతో రామ్, కిషోర్ తిరుమల మరో హిట్ ఇస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







