అక్టోబర్ 27న వస్తున్న రామ్ 'ఉన్నది ఒక్కటే జిందగీ'
- September 28, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేనుశైలజతో రామ్ కి చాలా గ్యాప్ తర్వాత హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది.
నేను శైలజ తర్వాత రామ్ నటించిన చిత్రం హైపర్. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో మళ్ళీ రామ్, నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమలకే చాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ మూవీని అక్టోబర్ 27న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.
ఉన్నది ఒక్కటే జిందగీ మూవీలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో రామ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. లవ్, ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ ఇటలీ మిలాన్ వంటి ఫేమస్ లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. ఈ మూవీతో రామ్, కిషోర్ తిరుమల మరో హిట్ ఇస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









