మొత్తానికి దసరా బరిలో నిలుచున్నా మహానుభావుడు

- September 30, 2017 , by Maagulf
మొత్తానికి దసరా బరిలో నిలుచున్నా మహానుభావుడు

శర్వానంద్ సెంటిమెంట్ మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఖైదీ, శాతకర్ణి చిత్రాలు ఉన్నప్పటికీ శతమానం భవతి చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు దసరా బరిలో ఎన్టీఆర్ జై లవకుశ , మహేష్ స్పైడర్ చిత్రాలు ఉన్నప్పటికీ మహానుభావుడు చిత్రం తో వచ్చి దసరా విన్నర్ గా నిలిచాడు.
ఆ రెండు చిత్రాల కంటే ఈ మూవీ కే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కంటెండ్ పరంగానే కాకుండా కామెడీ కూడా బాగుండడం తో సినీ ప్రేక్షకులు ఈ సెలవుల్లో ఈ మూవీ కే ఓటు వేస్తున్నారు. తొలి రోజు ఉదయం నుంచే ఈ సినిమా హవా అన్ని చోట్ల మొదలైంది. దీంతో సినిమా స్క్రీన్ పెంచాలని అందరూ కోరుతున్నారు. కాకపోతే 'జై లవకుశ'.. 'స్పైడర్' ప్రస్తుతం థియేటర్స్ లలో నడుస్తుండడం తో 'మహానుభావుడు' చిత్రానికి అనుకున్న స్థాయిలో స్క్రీన్లు దక్కలేదు.
ఐతే టికెట్ల కోసం డిమాండ్ బాగా ఉండటంతో షోలు, థియేటర్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'మహానుభావుడు' అదనపు షోలు, థియేటర్లు కేటాయిస్తున్నారు. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింతగా పెరగనున్నాయని అంటున్నారు. మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com