శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- October 04, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా దింపారు. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే.. ఎయిర్పోర్ట్లోని అపోలో ఆస్పత్రిలో ప్రయాణికుడిని తరలించగా.. అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్యాంకాక్ నుంచి సౌదీకి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న మహ్మద్ అల్ఫాసారి అనే 74 ఏళ్ల వృద్ధుడిగా గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









