గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించిన ఇండియన్ స్కూల్

- October 05, 2017 , by Maagulf
గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించిన ఇండియన్ స్కూల్

మస్కట్: మహాత్మా గాంధీ యొక్క 148 వ జయంతి కార్యక్రమం  ఇండియన్ స్కూల్ ఆధ్వర్యంలో గొప్ప ఉత్సాహంతో, సంతోషంగా నిర్వహించారు. అక్టోబర్ 2 వ తేదీ ఉదయం జరిగిన సమావేశంలో పదకొండవ  తరగతి  యొక్క అన్ని సెక్షన్ విద్యార్థులు పాల్గొన్నారు.  గాంధీజీ చెప్పిన అమూల్యమైన మాటలను రాతలతో  మరియు ఆయన చిత్రాలను పాఠశాల ఆవరణలో అలంకరించారు. విద్యార్థులు  పూజ్య బాపూజీ నేర్పిన అహింసా సిద్ధాంతాలు, పరిశుభ్రత తదితర ఆదర్శాలను అనుసరించడానికి పునరంకితమయ్యారు. తొలుత ఈ కార్యక్రమం పాఠశాల గాయక బృందం ఆలపించిన  ప్రార్థన గీతంతో ప్రారంభమైంది, పదకొండవ తరగతి విద్యార్థి రియా రెజీచే స్వాగత ప్రసంగం జరిగింది. మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలు మరియు ఆధునిక ప్రపంచంలోని గాంధీ యొక్క తత్వశాస్త్రం యొక్క ఔచిత్యంపై  మరొక  ప్రసంగం పదకొండవ తరగతి విద్యార్థి    ఆరతీ జయరాజ్ చేశారు. గాంధీ యొక్క తత్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యత, అహింస మరియు చరఖా తిప్పడం ద్వారా నూలు వడకడం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యతను వివరించారు. పదకొండవ తరగతి విద్యార్థులు చరఖాను తిప్పడం పట్ల విద్యార్థులందరూ ఎక్కువగా అభినందించారు.  వైస్ ప్రిన్సిపాల్  షైనీ రాయ్,తన ప్రసంగంలో సందేశాన్ని ప్రారంభిస్తూ గాంధీజీ సిద్ధాంతాలతోనే  ప్రపంచంలో మీరు చూడాలనుకుంటున్న మార్పు తప్పక గమనించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఆయన ' స్వచ్ఛ్ భారత్' గురించి గాంధీ యొక్క ఆదర్శాల ప్రచారం ప్రాధాన్యతను వివరించారు. మన జాతిపితను ఆదర్శంగా తీసుకొనివారి తరగతిలో, పాఠశాలలో, స్వచ్ఛ భారత్ ఒక చిన్న ప్రారంభాన్ని ప్రారంభించమని ఆమె  విద్యార్థులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com