"మైత్రీం భజతాం"
- November 02, 2015 ఇది కంచి పరమాచార్యుల వారి రచన. మనందరం ఏమేం చెయ్యాలో చెప్పే ఈ ప్రార్థనా గీతానికి సంగీతం శ్రీ వసంత దేశాయి గారు సమకూర్చగా, భారతరత్న-సంగీతకళానిధి యమ్మెస్ సుబ్బలక్ష్మి గారు దీన్ని 1966లో ఐక్యరాజ్యసమితిలో పాడారు.
మైత్రీం భజతాం అఖిల హృద్ జేత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్థాం త్యజత
త్యజత పరేషు అక్రమమాక్రమణం ।మైత్రీం।
జననీ పృథివీ కామదుఘాస్తే
జనకో దేవ: సకల దయాళు:
దామ్యత దత్తా దయధ్వం జనతా:
శ్రేయో భూయాత్ సకల జనానాం
తోటివారి పట్ల మైత్రిని పెంపొందించుకో, స్నేహంతో అందరి హృదయాలలోనూ నువ్వే నిండిపో, అందరిలోఉండే ఆత్మ ఒక్కటే అది నీలోనూ ఉన్నది నీలో ఉన్నదే అందరిలోనూ ఉన్నది. వారు వేరే నువ్వు వేరే కాదు. అనవసర స్పర్థలు, వైరుధ్యాలు వద్ధు. యుద్ధాన్ని త్యజించు, స్పర్థలను త్యజించు, అక్రమమైన ఆక్రమణలను త్యజించు. ఈ భూమి మన తల్లి, మన సమస్త కోర్కెలు తీర్చే కామధేనువు వంటిది. తల్లి కొరకు కొట్లాట వద్దు. ఆ దేవుడు మనందరికీ తండ్రి దయాళువు వారివురూ పరమ దయామూర్తులు. వారి పుత్రులమైన మనం కరుణనింపుకొని ఉండాలి. నీలో దయను పెంపొందించుకో, లోకములో జనులందరికీ శుభము కలగాలి, అందరూ క్షేమంగా ఉండాలి.
మూలం : కంచి కామకోటి పరమాచార్యుల వారి రచన
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..