"మైత్రీం భజతాం"
- November 02, 2015
ఇది కంచి పరమాచార్యుల వారి రచన. మనందరం ఏమేం చెయ్యాలో చెప్పే ఈ ప్రార్థనా గీతానికి సంగీతం శ్రీ వసంత దేశాయి గారు సమకూర్చగా, భారతరత్న-సంగీతకళానిధి యమ్మెస్ సుబ్బలక్ష్మి గారు దీన్ని 1966లో ఐక్యరాజ్యసమితిలో పాడారు.
మైత్రీం భజతాం అఖిల హృద్ జేత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్థాం త్యజత
త్యజత పరేషు అక్రమమాక్రమణం ।మైత్రీం।
జననీ పృథివీ కామదుఘాస్తే
జనకో దేవ: సకల దయాళు:
దామ్యత దత్తా దయధ్వం జనతా:
శ్రేయో భూయాత్ సకల జనానాం
తోటివారి పట్ల మైత్రిని పెంపొందించుకో, స్నేహంతో అందరి హృదయాలలోనూ నువ్వే నిండిపో, అందరిలోఉండే ఆత్మ ఒక్కటే అది నీలోనూ ఉన్నది నీలో ఉన్నదే అందరిలోనూ ఉన్నది. వారు వేరే నువ్వు వేరే కాదు. అనవసర స్పర్థలు, వైరుధ్యాలు వద్ధు. యుద్ధాన్ని త్యజించు, స్పర్థలను త్యజించు, అక్రమమైన ఆక్రమణలను త్యజించు. ఈ భూమి మన తల్లి, మన సమస్త కోర్కెలు తీర్చే కామధేనువు వంటిది. తల్లి కొరకు కొట్లాట వద్దు. ఆ దేవుడు మనందరికీ తండ్రి దయాళువు వారివురూ పరమ దయామూర్తులు. వారి పుత్రులమైన మనం కరుణనింపుకొని ఉండాలి. నీలో దయను పెంపొందించుకో, లోకములో జనులందరికీ శుభము కలగాలి, అందరూ క్షేమంగా ఉండాలి.
మూలం : కంచి కామకోటి పరమాచార్యుల వారి రచన
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







