2019 అసెంబ్లీ కోసం జనసేన ఎన్నికల ప్లాన్

- October 07, 2017 , by Maagulf
2019 అసెంబ్లీ కోసం జనసేన ఎన్నికల ప్లాన్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ర్టాల్లో మొత్తం స్థానాలకు పోటీ చేస్తున్నట్లు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుతం జనసేన.. ఎన్డీయేలో భాగస్వామి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు వుంటుందో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
మొన్నటికిమొన్న తెలుగు రాష్ర్టాల్లో 175 సీట్లకే పోటీ చేస్తామని జనసేన పార్టీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన విషయం తెల్సిందే! త్వరలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ 'ప్రజాయాత్ర'కు రెడీ అవుతున్నారని, దీని ముఖ్యఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారమేనని స్పష్టంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తారని, 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జన సైనికులకే టికెట్లు ఇస్తామన్న ఆయన, పార్టీ కోసం పనిచేసే వారందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రత్యేకహోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కృష్ణాజిల్లాలో జనసేన ఔత్సాహిక కార్యకర్తల ఎంపిక శని,ఆదివారాల్లో జరుగుతోందని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి హరిప్రసాద్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com