రచయిత జార్జ్ సాండర్స్కు బుకర్ ప్రైజ్.!
- October 18, 2017
బ్రిటన్కు చెందిన ప్రతిష్టాత్మక మాన్బుకర్ ప్రైజ్ను అమెరికా రచయిత జార్జ్ సాండర్స్ గెలుచుకున్నారు. సాండర్స్ రచించిన ''లింకన్ ఇన్ ది బార్డో'' నవలకు బుకర్ ప్రైజ్ లభించింది. ఈ ప్రైజ్ను గెలుచుకున్న అమెరికన్ రచయితలలో సాండర్స్ రెండో వారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ కుమారుడు పదకొండేళ్ళ విల్లీ మరణానికి సంబంధించి సాండర్స్ రచించిన ''లింకన్ ఇన్ ది బార్డో'' నవల అత్యంత వాస్తవికంగా ఉందని బుకర్ ప్రైజ్ న్యాయ నిర్ణేతల కమిటీ పేర్కొంది. విల్లీ మరణానికి సంబంధించి వందలాది మంది నుంచి సేకరించిన సమాచారాన్ని నవలగా మలిచిన తీరు ప్రశంసనీయమని న్యాయ నిర్ణేతల కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా రచయిత సాండర్స్ (58) మాట్లాడుతూ ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. ఈ ఏడాది మాన్ బుకర్ ప్రైజ్కు ముగ్గురు అమెరికా రచయితలు, ముగ్గురు బ్రిటన్ రచయితలు పోటీ పడ్డారు. మొత్తం ఆరుగురిలో జార్జ్ సాండర్స్ అవార్డు గెలుచుకున్నారు. కామన్వెల్త్ దేశాల రచయితలను ప్రోత్సహించేందుకు 1969లో ఈ అవార్డును ప్రోత్సహించారు.
ఆ తరువాత 2014 సంవత్సరంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల రచయితలను కూడా అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. గత ఏడాది రచయిత పాల్ బీటి ఈ అవార్డును గెలుచుకున్నారు. బీటి రచించిన ''ది సెల్లవుట్'' నవలకు అవార్డు లభించింది. పాల్ బీటి బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి అమెరికా రచయిత.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









