అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, కుమార్తె, అల్లుడిపై నేరాభియోగం
- October 20, 2017
పదవీచ్యుతుడైన పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు అవినీతికి పాల్పడ్డారంటూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం నేరాభియోగం చేసింది. లండన్లోని 'అవెన్ఫీల్డ్ ప్రాపర్టీస్'కు సంబంధించిన అవినీతి కేసులో వీరు ముగ్గురిపైనా కేసులు నమోదైన విషయం గమనార్హం. నవాజ్ షరీఫ్పై 'జాతీయ జవాబుదారి బ్యూరో'(ఎన్ఏబీ) సెప్టెంబరులో మూడుకేసులు నమోదు చేసింది. కాగా, అవెన్ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మర్యాం నవాజ్, అల్లుడు కెప్టెన్ (విశ్రాంత)మహమ్మద్ సఫ్దర్లపై సదరు కోర్టు నేరాభియోగం చేసింది. గొంతుక్యాన్సర్తో ఇప్పటిదాకా మూడు శస్త్రచికిత్సలు చేయించుకుని అనారోగ్యంతో ఉన భార్య కుల్సుమ్తో వెంట షరీఫ్ ప్రస్తుతం లండన్లో ఉన్నారు. ఈ కేసు నేపథ్యంలో ఆయన లండన్లో మీడియాతో మాట్లాడుతూ....తనపై నేరాభియోగం మోపడాన్ని ప్రస్తావిస్తూ న్యాయాన్ని చంపేశారంటూ ఆరోపించారు. ఈ నెల 26న జరిగే తదుపరి విచారణ సమయానికి తాను తిరిగి వస్తానని కూడా నవాజ్ షరీఫ్ ప్రకటించారు. బహుశా ఆయన ఆదివారం పాక్కు వస్తారని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?







