దోసకాయ ఎండు రొయ్యలు
- November 05, 2015
కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు - 2 టేబుల్ స్పూన్లు, దోసకాయ ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, టమోటా తరుగు - అరకప్పు, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: రొయ్యల్ని అరగంటపాటు నానబెట్టి నీరు పిండేయాలి. నూనెలో ఉల్లితరుగు వేగించి, టమోటా ముక్కలు, పసుపు, ఉప్పు కలపాలి. టమోటాలు మెత్తబడ్డాక రొయ్యలు, దోస ముక్కలు, కారం వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత 3 కప్పులు నీరు పోయాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేయాలి. అన్నంతో ఎంతో రుచిగా ఉండే కర్రీ ఇది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









