బహ్రెయిన్ లో పోలీస్ బస్సుపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి

- October 28, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో పోలీస్ బస్సుపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి

బహ్రెయిన్  : శుక్రవారం పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై  ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందగా  మరో  ఎనిమిది మందికి గాయాలపాలయ్యారుబహ్రెయిన్లో ఒక పోలీసు బస్సు శుక్రవారం మనామా వైపు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు బస్సుపై ఉగ్రవాదులు  దాడి చేశారు గాయపడిన పోలీస్ సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డారు. . మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు  బాంబుతో పోలీస్ బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు బస్సుపై బాంబులని గురి చూసి విసిరినట్లు  మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసు నివేదించిన తరువాత సంబంధిత అధికారులు నేరస్థుడిని  మరియు వాటిని న్యాయస్థానానికి తీసుకురావడానికి, ఈ దాడి  వెనుక ఉన్న తీవ్రవాద నేరాలలో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయడానికి విచారణ ప్రారంభించబడింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి ఈ కేసు మళ్ళించబడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com