హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత
- October 30, 2017
హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ (51) కన్నుమూశారు. నగరంలోని స్టార్ ఆస్పత్రిలో సోమవారం ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని జూబ్లీహిల్స్లోని స్వగృహానికి తరలించారు. హైదరాబాద్ నుంచి రంజీ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించిన శ్రీధర్.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా పనిచేశారు. బీసీసీఐ మేనేజర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు మేనేజర్గా శ్రీధర్ పనిచేశారు. 1988-1999 మధ్యకాలంలో ఆయన 97 ఫస్ట్క్లాస్ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆయన మృతిపట్ల హైదరాబాద్, బీసీసీఐ క్రికెట్ పెద్దలు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







