హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత
- October 30, 2017
హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ (51) కన్నుమూశారు. నగరంలోని స్టార్ ఆస్పత్రిలో సోమవారం ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని జూబ్లీహిల్స్లోని స్వగృహానికి తరలించారు. హైదరాబాద్ నుంచి రంజీ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించిన శ్రీధర్.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా పనిచేశారు. బీసీసీఐ మేనేజర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు మేనేజర్గా శ్రీధర్ పనిచేశారు. 1988-1999 మధ్యకాలంలో ఆయన 97 ఫస్ట్క్లాస్ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆయన మృతిపట్ల హైదరాబాద్, బీసీసీఐ క్రికెట్ పెద్దలు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!