36 మిలియన్ దిర్హామ్ల విలువైన డూప్లికేట్ కార్ పార్ట్స్ పట్టివేత
- November 01, 2017
యూఏఈ వ్యాప్తంగా గడచిన 9 నెలల్లో నిర్వహించిన 20 తనిఖీల్లో 36 మిలియన్ దిర్హామ్ల విలువైన డూప్లికేట్ కార్ పార్ట్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ ఫుత్తైమ్ మోటార్స్ సహకారంతో వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ తనిఖీల్ని నిర&్వహించాయి. డూప్లికేట్ కార్ పార్ట్స్ కారణంగా కార్లకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో 240 మంది ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్, అబుదాబీల్లో శిక్షణ ఇప్పించారు. అనంతరం వారిని రంగంలోకి దించి, డూప్లికేట్లకు అడ్డుకట్ట వేయగలిగామని అధికారులు చెప్పారు. దుబాయ్ పోలీసులతో కలిసి అధికారులు, రెండు ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించారు. షాపింగ్ మాల్స్లో తొలి క్వార్టర్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా వినియోగదారులకు డూప్లికేట్ కార్ పార్ట్స్పై అవగాహన కల్పించడం జరిగింది. అధీకృత డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మాత్రమే స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









