ఇక విదేశాల్లో పనిచేసే భారతీయులకి ఈపీఎఫ్వో భద్రత
- November 03, 2017
విదేశాలకు వెళ్లి పనిచేసే భారతీయ ఉద్యోగులకు ఇకపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్వో భద్రత అందించనుంది. తాము పనిచేసే దేశంలో అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను తామే మినహాయించుకుని ఈపీఎఫ్వోను ఎంచుకునే సౌలభ్యాన్ని ఈపీఎఫ్వో కల్పిస్తోందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జోయ్ శుక్రవారం తెలిపారు. ఇందుకోసం ఆన్లైన్లో వ్యవస్థను సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈ సదుపాయానికి సంబంధించిన మొత్తం ప్రక్రియను సులభతరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఎవరైతే ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తారో వారికి సర్టిఫికెట్ ఆఫ్ కవరేజీ (సీవోసీ)ని అందిస్తామని, దాన్ని పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక పేజీతో కూడిన దరఖాస్తు ఫారాన్ని ఈపీఎఫ్వో వెబ్సైట్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 18 దేశాలతో ఈపీఎఫ్వో ఒప్పందం కుదుర్చుకుంది.
'స్వల్పకాలం పాటు పనిచేసేందుకు ఇతర దేశాలకు వెళ్లేవారికి ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు తాము సంపాదించిన సొమ్మును అక్కడి పథకాల్లో దాచుకుంటున్నారు. అయితే వారు స్వదేశం తిరిగి వచ్చేస్తే ఆ సొమ్మును పొందేందుకు ఎక్కువకాలం ఆగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సీవోసీని ఎంచుకోవడం ద్వారా విదేశాల్లో పనిచేసే వారి సొమ్ము దీర్ఘకాలం ఆ దేశంలో ఉండిపోదు' అని జోయ్ వివరించారు.
ప్రపంచంలో ఉద్యోగులకు భద్రతను అందించే అతిపెద్ద సంస్థల్లో ఈపీఎఫ్వో ఒకటి. ఇందులో 9.26లో యజమానులతో పాటు, 4.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి నెలా 60.32 లక్షల మంది ఈపీఎఫ్వో ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







