ఏపీ ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్

- November 04, 2017 , by Maagulf
ఏపీ ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్

ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వారానికి ఐదున్నర రోజులు పనిచేస్తే చాలన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి పని చేయక్కర్లేదన్నారు. ఆఫీస్ అంటే బోర్ కొట్టకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు చంద్రబాబు.
ప్రపంచాన్ని జయించే శక్తి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాగా చదువుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. అయితే.. 24 గంటలూ చదువుకోవడం వల్ల లాభం ఉండదన్నారాయన.  చదువుతో పాటు ఆటలూ ఆడాలని సూచించారు. కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుకోమంటూ ఒత్తిడి చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చానన్నారు సీఎం చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com