రైతు ఆదాయం పెంచడమే లక్ష్యం: కేటీఆర్
- November 04, 2017
20 వేల కోట్ల పెట్టుబడులు..లక్ష ఉద్యోగాలు. రైతులకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్లో ప్రభుత్వ విధానాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెండింతలు చేస్తామని ప్రకటించారు. రెండు రోజుల్లో 13 సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్లో పరిశ్రమల ఏర్పాటుకు ఇస్తున్న రాయితీలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం పెద్దదే అయినా.. రైతులను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో అనుసంధానం చేయడం ద్వారా అది సాధ్యమవుతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. లక్షా ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు .తెలంగాణను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు
సులభతర వాణిజ్య, వ్యాపార అంశంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి, టీఎస్ ఐపాస్ ద్వారా ఐదు వేల అనుమతులిచ్చామన్నారు. దీంతో లక్ష కోట్ల పెట్టుబడులు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను 20 శాతానికి పెంచుతామని కేటీఆర్ ప్రకటించారు. ఇక రెండురోజుల ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్లో 13 సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది. జర్మన్ ఏషియా అసోసియేషన్తో నాలెడ్జ్, టెక్నాలజీ అంశాల్లో ఎంవోయూ చేసుకుంది. జహీరాబాద్ నిమ్జలో 6 వేల కోట్లతో సమగ్ర వ్యవసాయ ఆహార పరిశ్రమ నెలకొల్పేందుకు దక్షిణ్ ఆగ్రో పోలిస్ సంస్థ ముందుకొచ్చింది. మొత్తం ఒప్పందాల విలువ 7 వేల 2 వందల కోట్లకు చేరింది. వీటి ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







