హైదరాబాద్ లో పర్యటించనున్న ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్
- November 05, 2017
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ నెల 28, 29 తేదిల్లో హైద్రాబాద్లో పర్యటించనున్నారు. ఇవాంకా రాక కోసం హైద్రాబాద్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్ ఫలక్నుమాలో ఇవాంకాకు డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.
ఇవాంకా పర్యటనను పురస్కరించుకొని భద్రతా ఏర్పాట్లపై అమెరికా అధికారులు , తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు ఫలక్నుమా ప్యాలెస్ను సందర్శించారు. ఈ ప్రాంతంలోని రోడ్డు మార్గాన్ని కూడ పరిశీలించారు.
హైద్రాబాద్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్కు వస్తున్నారు.ఇవాంకా పర్యటన ముగిసేంతవరకు మాదాపూర్లోని రహేజా మైండ్ స్పేస్లో బస చేస్తారు.
ఇవాంకా కోసం దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం 'ఆక్టోపస్' కూడా బరిలోకి దిగనుంది. ఇప్పటినుంచే ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!