తెలుగింటి వంటకాలకు అరుదైన గౌరవం దక్కింది
- November 05, 2017
తెలుగింటి వంటకాలకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ తంతి తపాలా శాఖ తాజాగా భారతీయ వంటకాలతో కూడిన పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. ఇందులో 24 భారతీయ వంటకాలకు చోటుదక్కింది.
అలాగే, హైదరాబాద్కే ట్రేడ్ మార్క్గా చెప్పుకునే బిర్యానీ, పసందైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదానికి కూడా ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ 24 వంటకాల్లో నాలుగు రకాల తెలుగింటి వంటకాలు ఉన్నాయి. ఈ మేరకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుక్రవారం ఈ స్టాంపులను విడుదల చేసింది.
హైదరాబాద్ బిర్యానీ, తిరుపతి లడ్డు, ఆంధ్ర ప్రత్యేక వంటకాలైన ఇండ్లి దోశ, పొంగల్ ఫొటోలతో ఉన్న స్టాంపులను ఇండియా పోస్ట్ ఆవిష్కరించింది. అయితే హైదరాబాదీ బిర్యానీని చేర్చడానికి మాత్రం ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కుతుబ్ షాహీ సామ్రాజ్య స్థాపన, గోల్కొండ కోట నిర్మాణానికి మరో రెండు నెలల్లో 500 ఏళ్లు పూర్తవుతాయి.
ఈ 500వ వార్షికోత్సవం సందర్భంగా కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలకు ఇష్టమైన, రాయల్ వంటకంగా భావించే బిర్యానీని గౌరవిస్తూ పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. తిరుపతి ప్రసాదం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా స్టాంపుతో గౌరవించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







