చెన్నై చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..

- November 06, 2017 , by Maagulf
చెన్నై చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..

ప్రధానమంత్రి మోడీ  చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో గవర్నర్ పురోహిత్, సీఎం పళనిస్వామి  సహా పలువురు మంత్రులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 'దిన తంతి' పత్రిక 75వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు మోడీ చెన్నై వచ్చారు. చెన్నైలో వర్షాలు, వరద నష్టంపై సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి వివరించనున్నారు. వరద సహాయం కోరనున్నారు. అటు పీఎంవోలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఐఏఎస్ కుమార్తె వివాహానికీ ప్రధాని మోడీ హాజరవనున్నారు. డీఎంకే నేత కరుణానిధిని కలిసి పరామర్శించనున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు మోడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com