కారు ప్రమాదం: అగ్నికి ఆహుతైన వ్యక్తి
- November 06, 201720 ఏళ్ళ అరబ్ వ్యక్తి ఒకరు, కారు ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యారు. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలోని మ్లీహా రోడ్డులో సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ అబ్దుల్ రహ్మాన్ ఖతెర్ మాట్లాడుతూ, కారు టైరు పేలిన వెంటనే, అదుపు తప్పిన కారు సిమెంట్ బ్యారియర్ని ఢీకొన్నట్లు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే, మంటలు వ్యాపించాయి. రెస్క్యూ సిబ్బంది సమాచారం అందుకుని, ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాన్ని 'మార్గ్యు'కి తరలించారు. కారుకి అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని వీడియోగా చిత్రీకరించి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఈ తరహా వీడియోల్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..