'T20' సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- November 07, 2017నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తేనేం.. ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోరు అభిమానులను అలరించింది. విజయం కోసం పట్టుదలతో ఆఖరివరకు పోరాడిన కివీస్ను కట్టడిచేసి మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. వరుణుడి అంతరాయంతో ఎనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 5 వికెట్లకు 67 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఔట్ఫీల్డ్ తడిగా ఉండటంతో భారీ స్కోరు నమోదుకాలేదు. మనీశ్పాండే(17: 11 బంతుల్లో 1×4, 1×6), హార్దిక్ పాండ్య(14 నాటౌట్: 10 బంతుల్లో 1×6), విరాట్ కోహ్లి(13: 6 బంతుల్లో 1×4, 1×6) ధాటిగా ఆడారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేసింది. అయితే భారీ షాట్లతో విరుచుకుపడుతున్న కివీస్ బ్యాట్స్మెన్ను కట్టడిచేయడంలో భారత్ బౌలర్లు పైచేయి సాధించారు. గ్లెన్ ఫిలిప్స్(11), గ్రాండ్హోం(17 నాటౌట్) చివరి వరకు పోరాడారు. భారత బౌలర్లలో బుమ్రా 2, భువనేశ్వర్కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. అంతకుముందువన్డే సిరీస్ను సైతం భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన యువ బౌలర్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్