వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయల్ని వేపుకుని తింటే..?
- November 07, 2017వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉల్లిపాయలను దోరగా బాణలిలో వేపి తీసుకోవాలి. ఉల్లిలో వుండే స్కాలియన్లు అధికంగా సల్ఫర్ సమ్మేళనాలు శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే విటమిన్ బి గల పచ్చని ఆకుకూరలు, పప్పులను తీసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్ను ఉపయోగించాలి.
ఇంకా బీటా-కెరోటినాయిడ్లు ఎక్కువగా వుండే పండ్లు ఆప్రికాట్, క్యారెట్స్ తీసుకోవాలి. పాలకూర వంటివి తీసుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వుండే సిట్రస్ పండ్లను తీసుకోవాలి.
ఆరెంజ్, బ్రొకోలీని డైట్లో చేర్చుకోవడం మరిచిపోకూడదు. అయితే కారం, అల్లం కలిపిన ఆహారాలకు, మిరియాలు కలిపిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఎక్కువ కొవ్వు ఉన్న పాలపదార్థాలను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..