ఒమాన్ లో కలరా కేసు : ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ హెచ్చరిక

- November 09, 2015 , by Maagulf
ఒమాన్ లో కలరా కేసు : ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ హెచ్చరిక

ఇటీవల ఇరాక్ ను సందర్శించిన మహిళకు ఒమాన్  కలరా ఉన్నాడని బయటపడి నందున ,ప్రజలు ఈ అంటురోగం ప్రబలకుండా చాల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య శాఖ వారి సమాచారం ప్రకారం, 15 ఇరాక్ రాష్ట్రాల్లో, 2000 లకు పైగా కలరా కేసులు నమోదయినట్టు తెలిసింది. ఆ  మహిళ  ఆరోగ్యం  ఇపుడు  నిలకడగా  ఉందని , ఆమెతో ప్రయాణించిన వారికి జరిపిన  పరీక్షల్లో  వారు ఆరోగ్యంగానే  ఉన్నారని  తెలియ వచ్చిందని , తమ శాఖ వారు అన్ని అవసర మైన   చర్యలు  తీసుకుంటున్నామని  అధికారులు హామీ ఇచ్చారు. వండని లేదా సరిగా ఉడకని సముద్ర ఆహారాన్ని, పచ్చి కూరగాయలు, పళ్ళను, పాశ్చరైజ్ చేయబడని పాలు, పాల పదార్ధాలను తినవద్దని వారు  ముఖ్యంగా హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com