అప్పుల్లో చైనా
- November 11, 2017
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా ప్రస్తుతం అప్పుల వూబిలో కూరుకుపోయిందట. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ జౌ జియోచౌన్ అన్నారు. ఈ మేరకు దేశ ఆర్థిక వ్యవస్థపై జౌ రాసిన ఆర్టికల్ను చైనా సెంట్రల్ బ్యాంక్ తన వెబ్సైట్లో ఉంచింది.
తీవ్రస్థాయిలో ఉన్న అప్పుల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ జౌ అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తుల్లో మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. భవిష్యత్ సమస్యలను నివారించేందుకు ఆర్థిక సంస్కరణలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జౌ సూచించారు.
ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండాలంటే జోంబీ కంపెనీలు(అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీలు) తీసేయాలని సూచనలు చేశారు. అప్పులు, వాటి వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్న సంస్థలు అలాగే కొనసాగితే అది దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధికి ముప్పు కలిగిస్తుందని జౌ అభిప్రాయపడ్డారు. 15ఏళ్లుగా చైనా సెంట్రల్ బ్యాంకు గవర్నర్గా పనిచేస్తున్న జౌ త్వరలో రిటైర్ కాబోతున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







