అప్పుల్లో చైనా
- November 11, 2017
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా ప్రస్తుతం అప్పుల వూబిలో కూరుకుపోయిందట. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ జౌ జియోచౌన్ అన్నారు. ఈ మేరకు దేశ ఆర్థిక వ్యవస్థపై జౌ రాసిన ఆర్టికల్ను చైనా సెంట్రల్ బ్యాంక్ తన వెబ్సైట్లో ఉంచింది.
తీవ్రస్థాయిలో ఉన్న అప్పుల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ జౌ అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తుల్లో మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. భవిష్యత్ సమస్యలను నివారించేందుకు ఆర్థిక సంస్కరణలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జౌ సూచించారు.
ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండాలంటే జోంబీ కంపెనీలు(అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీలు) తీసేయాలని సూచనలు చేశారు. అప్పులు, వాటి వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్న సంస్థలు అలాగే కొనసాగితే అది దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధికి ముప్పు కలిగిస్తుందని జౌ అభిప్రాయపడ్డారు. 15ఏళ్లుగా చైనా సెంట్రల్ బ్యాంకు గవర్నర్గా పనిచేస్తున్న జౌ త్వరలో రిటైర్ కాబోతున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







