ఇండియాలో బహ్రెయిన్ జాతీయుల అరెస్ట్
- November 11, 2017
హైదరాబాద్: ఇండియాలోని హైదరాబాద్లో పోలీసులు, ఇద్దరు బహ్రెయినీ జాతీయుల్ని అలాగే ఓ ఖాజీని అరెస్ట్ చేశారు. అక్రమంగా బాల్య వివాహాల్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్న కారణంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. నిందితులు మొహమ్మద్ మొహమూద్ అబ్దుల్ రహ్మాన్ మొహమూద్, యూసుఫ్ మొహమూద్ అబ్దుల్ రహమ్మాన్ మొహమూద్ ఖైరి బహ్రెయిన్ జాతీయులు కాగా, హైదారాబాద్కి చెంది కాజీ అక్సర్ అలి రఫాయ్ ఉన్నారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో గత ఆగస్ట్లో రిజిస్టర్ అయిన కేసు విచారణలో భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డిసిపి వి.సత్యనారాయణ తెలిపారు. ఈ తరహా షేక్ పెళ్ళిళ్ళపై పోలీసులు ప్రత్యేకమైన దృష్టిపెట్టడంతో ఇటీవల పలువురు ఖాజీలు, అరబ్ దేశాలకు చెందిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









