ఇండియాలో బహ్రెయిన్ జాతీయుల అరెస్ట్
- November 11, 2017
హైదరాబాద్: ఇండియాలోని హైదరాబాద్లో పోలీసులు, ఇద్దరు బహ్రెయినీ జాతీయుల్ని అలాగే ఓ ఖాజీని అరెస్ట్ చేశారు. అక్రమంగా బాల్య వివాహాల్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్న కారణంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. నిందితులు మొహమ్మద్ మొహమూద్ అబ్దుల్ రహ్మాన్ మొహమూద్, యూసుఫ్ మొహమూద్ అబ్దుల్ రహమ్మాన్ మొహమూద్ ఖైరి బహ్రెయిన్ జాతీయులు కాగా, హైదారాబాద్కి చెంది కాజీ అక్సర్ అలి రఫాయ్ ఉన్నారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో గత ఆగస్ట్లో రిజిస్టర్ అయిన కేసు విచారణలో భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డిసిపి వి.సత్యనారాయణ తెలిపారు. ఈ తరహా షేక్ పెళ్ళిళ్ళపై పోలీసులు ప్రత్యేకమైన దృష్టిపెట్టడంతో ఇటీవల పలువురు ఖాజీలు, అరబ్ దేశాలకు చెందిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







