వెంకీ తో నటించనున్న సాయి ధరమ్ తేజ్
- November 11, 2017
గురు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ హీరో వెంకటేష్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే సినిమాకు ఓకె చెప్పాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీతో పాటు ఓ యువ కథానాయకుడు నటించనున్నాడు. అయితే ఆ యంగ్ హీరో ఎవరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
కొద్ది రోజులుగా మామ అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వెంకీతో నటించబోయే యంగ్ హీరో నాగచైతన్య కాదట. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్లో నటించేందుకు అంగీకరించాడట. దిల్రాజు పాటు అనిల్ రావిపూడితో మంచి అనుబంధం ఉన్న సాయి, ఈ క్రేజీ మల్టీ స్టారర్ కు ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ టాక్ నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







