వెంకీ తో నటించనున్న సాయి ధరమ్ తేజ్
- November 11, 2017
గురు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ హీరో వెంకటేష్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే సినిమాకు ఓకె చెప్పాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీతో పాటు ఓ యువ కథానాయకుడు నటించనున్నాడు. అయితే ఆ యంగ్ హీరో ఎవరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
కొద్ది రోజులుగా మామ అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వెంకీతో నటించబోయే యంగ్ హీరో నాగచైతన్య కాదట. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్లో నటించేందుకు అంగీకరించాడట. దిల్రాజు పాటు అనిల్ రావిపూడితో మంచి అనుబంధం ఉన్న సాయి, ఈ క్రేజీ మల్టీ స్టారర్ కు ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ టాక్ నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









