స్నేహితుడిని సరదాగా సముద్రంలోకి నెట్టి ఆ వ్యక్తి చావుకి కారణమయిన ఇద్దరు కార్మికులు
- November 13, 2017
అబుదాబి : " నిప్పుతోనూ..నీళ్ళతోనూ పరాచికాలు ఆడవద్దని " మన పెద్దలు పదే పదే చెబుతుంటారు..కానీ నది వద్దకో...సముద్రం చెంతకు వెళ్ళినపుడు ఆ హితబోదని ఎంచక్కా మర్చిపోతాం. అచ్చం ఇదేవిధంగా అబూధాబీలో గత వారాంతంలో ఓ విషాదం చోటు చేసుకొంది. ఇద్దరు కార్మికులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ స్నేహితుడిని పొట్టన పెట్టుకొన్నారు. ఆ వ్యక్తిని " సరదాగా " సముద్రంలోకి నెట్టి అతని చావుకి ప్రత్యక్ష కారణమయ్యెరనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అల్ డఫ్రాలోని మొదటి ఇన్స్పెషన్లోని క్రిమినల్ కోర్ట్ ఈ సంఘటన ఆసియా దేశాలకు చెందిన మిత్రులు గత వారాంతంలో ఈత కోసం సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు సంఘటన జరిగింది. వారు లోతైన నీటిలో ఈత కొట్టి ఒడ్డుకి వచ్చి తీరానికి సమీపంలో నిలబడినప్పుడు, ఆ వ్యక్తులలో ఒకరు సరదాగా సహోద్యోగి "తన బ్యాలెన్స్ తనిఖీ " చేసేందుకు సముద్రంలోకి నెట్టాడు. దాంతో బాధితుడు ఆకస్మికంగా పట్టు తప్పి నీటిలో ఉన్న ఒక కొండరాతికి బలంగా అతని తల తగిలింది. దాంతో తీవ్రంగా రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతుని సహచరులు ఆ సన్నివేశం నుంచి భయంతో పారిపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి మరణానికి తమనే బాధ్యులుగా గురిచేస్తారని వారు భయపడ్డారు. తమ స్నేహితుడు చనిపోయినట్లు ఆ విషయాన్ని పోలీసులకు నివేదించలేదు. తర్వాత పోలీసులు మృతి చెందిన ఉద్యోగిని బీచ్ వద్ద కనుగొన్నారు మరియు పోలీసుల విచారణలో మృతిని సహచరులు ఇద్దరికి ఆ మరణంతో పాలుపంచుకున్నారని తేలింది. తెలియక చేసిన తమ తప్పుని మన్నించి చనిపోయిన తమ స్నేహితుని కుటుంబానికి రక్తపరాధ సొమ్ము చెల్లిస్తామని.తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోర్టులో న్యాయమూర్తిని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. కాగా నవంబర్ 26 వ తేదీన విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









