జపాన్‌ ప్రధానితో నరేంద్రమోదీ భేటీ

- November 14, 2017 , by Maagulf
జపాన్‌ ప్రధానితో నరేంద్రమోదీ భేటీ

ఫిలిప్పీన్స్‌లో మూడో రోజు పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో ఆయన సమావేశమయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించారు. గ్లోబల్‌ పార్టనర్‌షిప్‌పై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆయన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్‌ టర్నబుల్‌తో భేటీ అయ్యారు.
వాళ్లతో పాటు బ్రూనే సుల్తాన్‌ హస్సనల్‌ బోల్కై, న్యూజిలాండ్‌ ప్రధాని జసిడా ఆండ్రేన్‌ను మోదీ కలిశారు. ఆగ్నేయాసియా దేశా సంఘం(ఆసియాన్‌) స్వర్ణోత్సవాల నిమిత్తం మోదీ ఆదివారం ఫిలిప్పీన్స్‌ వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై మోదీ ట్రంప్‌తో చర్చించారు. వీరిద్దరి భేటీపై శ్వేతసౌధం స్పందించింది.

ట్రంప్‌ అధ్యక్షతన భారత్‌తో బంధాలు మరింత బలోపేతం కానున్నాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com