100 కి.మీ. దాటిన జగన్ ప్రజా సంకల్పయాత్ర

- November 14, 2017 , by Maagulf
100 కి.మీ. దాటిన జగన్ ప్రజా సంకల్పయాత్ర

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర 100 కిలో మీటర్లు దాటింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఆయనకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గొడిగనూరులో  జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఫించన్ కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. ఏపీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పాలన సాగిస్తామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com