భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త

- November 15, 2017 , by Maagulf
భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త

భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ బుధవారం శుభవార్త వెల్లడించింది. గత వారంలో జీఎస్టీ మండలి పన్ను స్లాబ్ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ మండలి చీఫ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం ప్రకారం రెస్టారెంట్లలో 200 ఆహారపదార్థాల ధరలు బుధవారం నుంచి తగ్గాయి. జీఎస్టీ పన్నుపోటు తగ్గడం వల్ల రెస్టారెంట్లలో ఆహారపదార్థాల రేట్లు దిగిరావడంతో భోజనప్రియులు బుధవారం రెస్టారెంట్లకు బారులు తీరారు. రెస్టారెంట్ భోజనంబు నాకే ముందు అంటూ భోజనప్రియులు లొట్టలేసుకుంటూ రెస్టారెంట్లకు వస్తున్నారని హోటల్ యజమానులంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com