ఏందో మన రాహుల్ బాబు గోల!!
- November 16, 2017
దిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగాల్లో ఒక్కోసారి తప్పులు దొర్లుతుంటాయి. ప్రత్యర్థులు వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో అవి మరింత వైరల్ అవుతుంటాయి. గతంలో బెంగళూరులో 'ఇందిరా క్యాంటీన్లు' ప్రారంభించిన సమయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్ అన్నారు. బెంగళూరులోని అన్ని ప్రాంతాల్లో అనాల్సిందిపోయి అన్ని రాష్ట్రాల్లో అన్నారు.
తాజాగా రాహుల్ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ అహ్మదాబాద్లో ప్రసంగిస్తూ.. 'బంగాళాదుంపల్ని యంత్రంలో పెట్టగానే బంగారం వచ్చేలా ఓ యంత్రం తయారుచేస్తా. దీని వల్ల రైతులకు బాగా డబ్బులు వస్తాయి' అని వ్యాఖ్యానించారు.
రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఉత్తర్ప్రదేశ్ రైతులను ఉద్దేశిస్తూ.. 'మామిడి పండ్లను తయారుచేసే యంత్రాలు' అంటూ వ్యాఖ్యానించారు. దాంతో రైతులు మామిడి పండ్లను పండిస్తే రాహుల్ మాత్రం వాటిని తయారు చేస్తారంటూ ఛలోక్తులు విసిరారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







