రికార్డు ధర పలికిన లియోనార్డో డావిన్సీ కళాఖండం

- November 17, 2017 , by Maagulf
రికార్డు ధర పలికిన లియోనార్డో డావిన్సీ కళాఖండం

న్యూయార్క్‌ : ప్రముఖ చిత్ర కళాకారుడు లియోనార్డో డావిన్సీ చిత్రించిన 'జీసస్‌ క్రైస్త్‌' పెయింటింగ్‌ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైంది. 'విశ్వ రక్షకుడు' అనే పేరుతో డావిన్సీ ఈ పెయింటింగ్‌ వేశారు. ఐదు వందల సంవత్సరాల నాటి ఈ పెయింటింగ్‌ సుమారు 450 మిలియన్‌ డాలర్లు (దాదాపు రు.2.93 వేల కోట్లు) ధర పలికింది. ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా ఇది ప్రశంసలు అందుకుందని వేలం నిర్వహించిన క్రిస్టీస్‌ సంస్థ తెలిపింది. అయితే ఎవరు కొనుగోలు చేశారనేది వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com