దక్షిణాఫ్రికాలో భారత రాయబారి ఇంట చోరీ
- November 20, 2017
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత రాయబారి శశాంక్ విక్రమ్ కుటుంబాన్ని బంధించిన దుండగులు... దోపిడీకి పాల్పడ్డారు. డర్బన్లోని వారి అధికారిక నివాసంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం. భారత కాన్సల్ జనరల్గా శశాంక్ విక్రమ్.. డర్బన్లో విధులు నిర్వహిస్తున్నారు. శశాంక్ విక్రమ్ ఫ్యామిలీ, ఇద్దరు చిన్నారులు, సిబ్బంది, వీరి వద్దకు వచ్చిన ఓ టీచర్ను బంధించిన దుండగులు.. ఇంట్లోని విలువైన ఆభరణాలు, నగదు, వస్తువులను దోచుకెళ్లినట్లు తెలిసింది. అయితే, బాధితులంతా బాగానే ఉన్నారని, కానీ కొంత భయాందోళనకు గురయ్యారని చెప్పారు. దుండగులు ఎవరికీ ఏ హాని తలపెట్టలేదని కాన్సల్ ఎస్కే పాండే తెలిపారు. శశాంక్ ఇంట్లోని ఓ సిబ్బందికి చెందిన ఫోన్ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని, దాని ద్వారా నిందితులను పట్టుకోవచ్చని చెప్పారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం.. రాయబారులకు రక్షణ కల్పించడం దక్షిణాఫ్రికా బాధ్యత అని భారత్ గుర్తు చేసింది. కాగా, ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష