మన కాలపు త్యాగయ్య మంగళంపల్లి ప్రథమ వర్ధంతి నేడు...!!
- November 22, 2017
ఏ వేదిక మీదనున్నా చెరగని చిరునవ్వు... మధుర కంఠస్వరం, ఎలాంటి క్లిష్టమైన రాగం పడుతున్నా గమకాలు వేస్తున్నా అదే నగుమోము..!! ఎప్పటికీ మరపురాని ఆ నగుమోము మనకి దూరమై ఏడాది అయ్యింది. బాలమురళీకృష్ణ గారు తన 86 ఏట... చెన్నైలో తన నివాసంలో మృతి చెందారు. మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ముద్దుల తనయుడైన బాలమురళికి సంగీతం అంటే ఎంతో ఇష్టం. 8 వ ఏట కచేరీ చేసిన ఆయన.. కంఠస్వరం నుంచి జాలువారే పాటలు సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేశాయి.
గాయకులుగానే కాకుండా వయొలిన్, మృదంగం తదితర ఇతర సంగీత వాయిద్యాల్లోనూ ప్రావీణ్యత సాధించిన ఘనత ఆయనది. పద్మభూషణ్, డాక్టరేట్ల వంటి బిరుదులను పొందిన ఆయన పలు చిత్రాల్లోనూ నటించారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆలపించిన కీర్తనలు సంగీత ప్రియుల హృదయ కుహరాల్లో నిత్యం ఆ మధుర మోహన మురళీ రవళులు సందడులు చేస్తూనే ఉంటాయి. ఆ ప్రసన్న వదనం మనకీ ప్రసన్న భావాలనే కలిగిస్తూ ఉంటుంది. మన కాలపు త్యాగయ్య మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ప్రథమ వర్థంతి సందర్భంగా నివాళులు. భువన సమ్మోహనకరమైన గానాన్ని మనకి అన్నేళ్లు వినిపించినందుకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









